నా కొడుకు వయస్సు 25 ఏళ్లు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ప్రజా జీవితంలోకి వచ్చాడు. అక్రమ కేసులో అరెస్ట్ చేయించారు. విదేశాల్లో చదివిన నా కొడుకుని వీధి పోరాటాలకు సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబుకు కృతజ్ఞతలు. నేను విద్యార్థి దశ నుంచే ఉద్యమాలతో పెరిగినవాడిని. నాకన్న మించి నా
ఇంకా ఎన్ని గొడవలు చేస్తారో చేయ్యండి. చర్యకు ప్రతి చర్య కచ్చితంగా ఉంటుంది. నా ఓపికను బలహీనతగా అనుకోవద్దు. అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. న్యాయం, ధర్మం కోసం పనిచేయండి. అన్యాయంగా అధర్మంగా పని చేయడానికి వచ్చే అధికారులను వదిలిపెట్టను. ఇకపై పూర్తి సమయం కేడర్తోనే ఉంటాను.
లండన్లోని వార్విక్ యూనివర్సిటీ నుంచి నా కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో డిస్టింక్షన్లో ఉత్తీర్ణత సాధించి 'మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్'లో మాస్టర్ డిగ్రీ పట్టా అందుకోవడం తండ్రిగా నాకు చాలా గర్వంగా ఉంది.
తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) ఛైర్మెన్గా పదవీకాలం పొడిగించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.
ఆపదలోనే కాదు ఆనందంలో కూడా నేనున్నాను అంటూ భరోసా కల్పిస్తూ.. సంక్రాంతి పర్వదినాన చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు సంతోషంగా గడపాలన్న ఆలోచనతో ప్రతి ఇంటికి ఓ పెద్ద కొడుకుగా నియోజకవర్గ పరిధిలో నివసించే ఒక లక్షా 60 వేల కుటుంబాలకు బట్టలు ఇవ్వడం జరిగింది.
నేడు ప్రమాణ స్వీకారం చేసిన నూతన మంత్రివర్గ సభ్యులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు💐. నిబద్దమైన పార్టీ కార్యకర్తగా కొత్త మంత్రులతో భుజం భుజం కలిపి సమన్వయంగా పనిచేయడానికి నేను సిద్ధం. నూతన మంత్రివర్గంతో కలిసి ఉద్యమస్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధికోసం జగనన్న సారథ్యంలో పనిచేస్తాను.
Wishing our young and dynamic leader
@YSJagan
Anna a very happy birthday. Your 19 months of ruling has brought tremendous development and welfare for the people of our state. You are in inspiration and hope you keep on inspiring current and future generations.
#HBDYSJagan
Happy birthday to a visionary leader YS Jagananna! Your headstrong approach and passion to achieve what you set out to do are so remarkable and truly inspirational. You have motivated us to do our very best. Thank you for being such a wonderful leader!
#HBDManOfMassesYSJagan
రాయలచెరువు సమీపంలో వరద ముంపు ప్రజలు తిరిగి సురక్షితంగా తమ సొంత ఇళ్లకు వచ్చే వరకు నేను కూడా ఇంటికి వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నాను. ప్రజల్లో, అధికారులు, సిబ్బందిలో ఆత్మస్థైర్యం నింపడం కోసం రాయలచెరువు కట్టపైనే ఉంటాను. ఇదే కట్టపై ఉండి పని చేస్తాను.
తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ చైర్మన్గా, ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ విప్గా నాకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏🙏
మొదటి రోజు నుంచి రాయలచెరువు కట్టపైనే బసచేసి చెరువు మరమ్మతు పనులను అనుక్షణం పర్యవేక్షించడం జరిగింది. రాయలచెరువు లీకేజీలకు పూర్తిస్థాయిలో అడ్డకట్ట వేసిన తర్వాత స్థానికులందరూ ఇళ్లకు చేరుకున్నాక ఏడు రోజుల తర్వాత ఇంటికి చేరుకోవడం జరిగింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయిరెడ్డిగారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. ప్రజలకు మరింతగా సేవ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
@VSReddy_MP
ఎన్నో భాధలను భరించి.. నా ప్రతి కష్టనష్టాలో పాలుపంచుకొని.. ఈరోజు ఇంత పెద్ద మెజార్టీతో 'చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యుడి'గా అఖండ విజయం అందించిన ప్రతి ఒక్క కార్యకర్తకు, అభిమానికి నా హృదయపూర్వక నమస్కారాలు. 🙏🙏🙏
- వెంకన్న సాక్షిగా నానికి ఏ చిన్న గాయం లేదు.
– స్విమ్స్ వైద్య నివేదికలు వెల్లడి.
– నాని డ్రామాలకు చెంపపెట్టు.
– ఒక్క నివేదికలోనూ గాయపడినట్టు లేదు.
– రాజకీయ లబ్ధికోసమే నటన.
- ఒక వ్యక్తి నటనకు అనేక మంది అమాయకులు, ఉద్యోగులు బలి.
- నాని నటనకు నంది అవార్డు ఇవ్వాలి.
కలియుగ
శభాష్ చెవిరెడ్డి అనిపించుకునేలా.. ప్రతి పంచాయతీ అభివృద్ధికి నా వంతు బాధ్యతగా కృషి చేస్తాను. నాపై వుంచిన నమ్మకానికి ప్రజలు సగర్వంగా తలెత్తుకునేలా అభివృద్ధికి కృషి చేస్తాను.
పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్రెడ్డి గారి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఒక సమర్థవంతమైన నాయకుడిని కోల్పోయాం. గౌతమ్రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
#MekapatiGauthamReddy
Wishing a very happy wedding anniversary to YS Jagan garu and Bharathi garu. Wishing you both many many years of togethernesses and may all your wishes come true.
చంద్రగిరి నియోజకవర్గం పల్లెబాట కార్యక్రమంలో భాగంగా ఎర్రావారిపాళెం మండలంలోని ఓ పాకలో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న 78 ఏళ్ల సిద్ధమ్మ అవ్వ వద్ద టిఫిన్ చేయడం జరిగింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయాన్ని అందుకున్న శ్రీ మేకపాటి విక్రమ్రెడ్డిగారికి శుభాభినందనలు💐. విక్రమ్రెడ్డిగారికి భారీ విజయాన్ని అందించిన ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు🙏.
మెగాస్టార్ చిరంజీవిగారిపై.. నా పేరిట ప్రచారం అవుతున్న పోస్టింగులకు నాకు ఎటువంటి సంబంధం లేదు. తుడా ఛైర్మన్గా ఉన్నప్పటి నుంచి చిరంజీవిగారితో సత్సంబంధాలు ఉన్నాయి. వైఎస్ జగన్కి, చిరంజీవికి సత్సంబంధాలు ఉండకూడదన్న క్షుద్ర ఆలోచనలతో తెలుగుదేశం పార్టీ అసత్య ప్రచారానికి పూనుకుంది.
భారతీ సిమెంట్ యాజమాన్యం వితరణ చేసిన 35వేల ఖాళీ సంచులు, టీటీడీ నుంచి 20 వేల సంచుల్లో ఇసుక, క్వారీ డస్ట్ను కలిపి రాయలచెరువుకు లీకేజీలు ఏర్పడిన ప్రదేశంలో బెర్మ్ పద్ధతిలో అరికట్టాము. నీటి ప్రవాహానికి బస్తాలు కొట్టుకుపోకుండా 700 టన్నుల పెద్దపెద్ద బండరాళ్లును వీటికి దన్నుగా ఉంచాము.
గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు తాడేపల్లిలోని తన నివాసం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన గోశాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది.
తిరుపతి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించినందుకు పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. నాపై ఎంతో నమ్మకంతో అప్పగించిన బాధ్యతను వంద శాతం విజయవంతం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తాను.
ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ అన్న గారి సతీమణి శ్రీమతి వైఎస్ భారతమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
'స్థానిక బలం’ మనదే .. ఎవ్వరికీ భయపడ వద్దు..!
ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఎవ్వరూ వదులుకోవద్దు.
ప్రతి పక్షంలోనూ ప్రజల మంచి కోసమే పని చేద్దాం.
ఐక్యమత్యంతో దాడులను ఎదురిద్దాం.
జగనన్న పరిపాలనలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే.. ప్రజలు మీ అందరినీ ఆశీర్వదించి గెలిపించారు.. ఇప్పుడు
ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని 1,150 మంది గురువులకు బొట్టు పెట్టి ఆహ్వానం పలికి నా కుటుంబ సభ్యుల్లో ఒకరుగా భావించి బట్టలు పెట్టి జ్ఞాపికలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది.
మాటిస్తే నిలబెట్టుకోవాలి.. హామీ ఇస్తే అమలు చేయాలి.. కష్టాన్ని కనిపెట్టి కన్నీరు తుడవాలి.. మహానేత వైఎస్సార్ నేర్పిన పాఠాలివి. అందుకే మరణించాక కూడా జనం గుండెల్లో బతికున్నారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన వైఎస్సార్గారి 73వ జయంతి సందర్భంగా మహానేతకు ఘన నివాళులు🙏.
#YSRJayanthi
తిరుపతిలో ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబందించిన రెండు ప్రత్యేక కోర్డులను ప్రారంభించడానికి విచ్చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గారికి స్వాగతం పలకడం జరిగింది.
ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. రోశయ్య గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
అందరికీ అన్ని వ్యసనాలు ఉంటాయి.. నాకు నా సంపదలో 75 శాతం నా ప్రజల కోసం ఖర్చు చేయడమే నా వ్యసనం.. నా కుటుంబానికి 25 శాతమే ఖర్చు చేస్తా. అభివృద్ధి నా బాధ్యత.. నాకు ప్రజలకు ఉన్న ఆత్మీయత అది.
అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారు. కాలక్షేపం కోసం, స్వప్రయోజనాల కోసం పాకులాడే చంద్రబాబు గురించి మాట్లాడటం అంటే సమయం వృథా చేసుకోవడమే.
రాయలచెరువు ఎగువ ప్రాంతంలో జలదిగ్బంధంలో చిక్కుకున్న 11 గ్రామాల ప్రజలకు 25 టన్నుల నిత్యావసర సరుకులను అందచేయడం జరిగింది. ఈ నిత్యావసరాలు దాదాపు 16 రోజుల వరకు ప్రజల ఆకలి తీర్చనున్నాయి.
అజరామరమైన కీర్తి ప్రతిష్టలు, సేవా తత్పరుమే తన లక్ష్యంగా జీవించిన ఉదార స్వభావులు, ఎందరో జీవితాలకు వెలుగులు నింపిన మా తండ్రిగారైన శ్రీ చెవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి గారు స్వర్గస్తులైనారని తెలియజేయడమైనది. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని మనసారా కోరుకుంటున్నాను.
భాస్కర్ నాకు అత్యంత సన్నిహితుడు. మీ పార్లమెంట్కు మంచి చేస్తాడు.. ప్రజలకు మంచి చేస్తాడు.. మనసు నిండా పేదలపై, ప్రజలపై ప్రేమ ఉన్న వ్యక్తి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు భాస్కర్పై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతున్నాను - ప్రకాశం జిల్లా, కొనకొనమిట్ల 'మేమంతా సిద్ధం' సభలో సీఎం జగనన్న
ఈ కొత్త ఏడాది మీ జీవితంలో విజయాలను, సంపదను, సంతృప్తిని సమృద్ధిగా తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
మనమందరం కలసికట్టుగా ఉందాం.. కుటుంబంలా ఉందాం.. ఐకమత్యంగా మెలుగుదాం.. సమస్య వచ్చినా కలిసుందాం.. సంతోషం వస్తే పంచుకుందాం.. అభివృద్ధి కలిసి కట్టుగా చేసుకుందాం.
పుణ్య దంపతులైన శ్రీ సీతారాముల దివ్య ఆశీస్సులతో మీరు, మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.
మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశానికి విచ్చేసిన ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గారికి వినమ్రంగా నమస్కరించడం జరిగింది. ఈ సందర్భంగా 'వెరీ డైనమిక్ లీడర్' అంటూ ద్రౌపది ముర్ము గారికి పరిచయం చేసిన జగనన్నకు ధన్యవాదాలు.
రామచంద్రాపురం మండలంలోని 11 గ్రామాలకు ఏపీ ప్రభుత్వం పంపించిన 10 టన్నుల నిత్యావసర సరుకులు హెలికాప్టర్ ద్వారా వచ్చాయి. ముంపు బాధితులకు సత్వర సాయం అందించేందుకు నేవీ హెలికాప్టర్ల ద్వారా దాదాపు 5 వేల మందికి నిత్యావసర సరుకులను గ్రామాలకు చేర్చాము.
దేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఎదుర్కోనన్ని సమస్యలు, సవాళ్లు, దాడులను ఎదుర్కోని.. వాటిని తట్టుకుని నిలబడి.. మడమ తిప్పకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాడింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రయాణంలో పార్టీకి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
#12YearsForYSRCP
పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు, చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనుల పట్ల ఆకర్షితులై చంద్రగిరి పట్టణంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ముస్లిం సోదరులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కండువా కప్పి
కార్యకర్తల కష్టాలు ఎలా ఉంటాయో కార్యకర్త నుండి ఎదిగిన నాకు బాగా తెలుసు. అధికారంలోకి రాకముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినవారికి న్యాయం చేస్తాం.
ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు ఇన్ని పదవులు అనుభవిస్తున్నారంటే దాని వెనకాల జగనన్న కష్టం, ఎదుర్కొన్న అవమానాలు, కక్ష సాధింపులు, అనుభవించిన జైలు శిక్షలు ఎన్నో ఉన్నాయి. అలాంటి నాయకుడిని మనమందరం కాపాడుకోవాలి.
రాజన్నా.. నీవు లేని లోటు ఎప్పటికీ తీరదు. చిరునవ్వుతో నిలిచే నీ రూపం ఎప్పటికీ మరపుకు రాదు. నువ్వు పంచిన జ్ఞాపకాలు చెరిగిపోవు. నువ్వు సర్వవ్యాప్తం అవడానికే అంతర్థానం అయ్యావు. తెలుగునేలన నిత్యస్మరణుడివి కావడానికే విరామం ఇచ్చావు.
#YSRVardhanthi
#YSRForever
రాయలచెరువు కట్టకు లీకేజీలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి గారి ఆదేశాల మేరకు చెన్నై, తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్లు, ఇరిగేషన్ నిపుణులను పిలిపించి సమస్యను గుర్తించాం.
వైఎస్ రాజశేఖరరెడ్డిగారి ఆశయాలే తన జెండాగా,పార్టీ ఎజెండాగా..తండ్రి ఓ అడుగువేస్తే, తను మరో నాలుగడుగులు వేస్తున్న వైఎస్ జగన్గారి పాలనలో వైఎస్సార్గారు సజీవమై బ్రతికి ఉన్నారు.భవిష్యత్తులో కూడా బతికే ఉంటారు. వైఎస్ రాజశేఖరరెడ్డిగారి 13వ వర్ధంతి సందర్భంగా మహానేతకు నివాళి.
#JoharYSR
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిగారి ఆదేశాలతో యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టి రాయల చెరువు లీకేజీని అదుపులోకి తెచ్చాము. రాయలచెరువుకు అవుట్ ఫ్లోను మరింత వెడల్పు చేసి.. దిగువకు నీరు విడుదల చేశాం.
ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ పూనం మాలకొండయ్య గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
నెల్లూరు జిల్లాలో పలు కార్యక్రమాలలో పాల్గొని కొవ్వూరు హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నజగనన్నతో మాట్లాడటం జరిగింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్రెడ్డిని ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించాలి. చరిత్రలో నిలిచిపోయేలా విక్రమ్రెడ్డి మెజారిటీ ఉండాలి. మేకపాటి గౌతమ్రెడ్డి ఆత్మ శాంతించేలా ప్రజా తీర్పు ఉండాలి.
చంద్రగిరి నియోజకవర్గ ప్రజలే నా కుటుంబంగా భావించాను.. వారి క్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నా.. కరోనా వంటి కష్టం వచ్చినా.. వరదలు వంటి విపత్తు వచ్చినా.. పండుగలు వచ్చినా.. పర్వదినాలైనా అందరికీ మంచి చేయాలన్న తపనతో వారి వెంట నిలబడుతున్నా. నా కుటుంబం వేరు కాదు.. నా ప్రజలు వేరు కాదని
ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గంలో దళితులు ఏళ్ల తరబడి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. ఎలాగైనా ఈఎన్నికల్లో వారికి ఓటు హక్కు కల్పించాలనే లక్ష్యంతో పోరాటం చేశాను.